04-05-2025 09:23:29 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదానికి గురైన ఇల్లందు ఏబీఎన్ రిపోర్టర్ బొమ్మగాని రమేష్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) ఆదివారం ఇల్లందులో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రమేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట నాయకులు పేరయ్య, గౌరిశెట్టి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.