19-05-2025 12:00:00 AM
మఠంపల్లి, మే 18: సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని కాల్వపల్లి తండా గ్రామానికి చెందిన మాలోతు జోగా కుమారుడు శంకర్ నాయక్ (ఇరిగేషన్ ఏఇ), బానోతు మామోజీ కుమార్తె మహీ (మిషన్ భగీరథ ఏఇ) వివాహ మహోత్సవానికి రాష్ట్ర పౌరసరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మూడవతు పార్వతి కొండా నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాబు నాయక్, బచ్చలకూరి బాబు, పిచ్చి రెడ్డి, ఎల్లారెడ్డి,మాలోతు హనుము నాయక్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.