07-08-2024 10:10:27 PM
హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్శంగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై బుధవారం మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీలు పాల్గొన్నారు. సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ను నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగస్టు 11వ తేదీన హారుకానున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు వైరాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం సభాస్థలిని ఈనెల 11న గండి వద్ద ఎత్తిపోతల పథకం కోసం స్థల పరిశీలన మంత్రి ఉత్తమ్ చేయనున్నారు.