03-08-2025 12:44:44 AM
- వసూళ్ల దందాకు పాల్పడినందుకు చర్యలు
నాగర్కర్నూల్, ఆగస్టు 2 (విజయక్రాంతి): నాగర్కర్నూల్ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ల దందాకు పాల్పడిన ఇద్దరు సిబ్బందిని విధుల్లో నుంచి శాశ్వతంగా తొలగించినట్లు శనివారం ఉన్నతాధి కారులు తెలిపారు. ఆఫ్లైన్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కంప్యూటర్ ఆపరేటర్ ముస్తాక్, వార్డెన్ దర్వేష్ తరచూ వసూళ్లకు పాల్పడుతున్న విషయం బహిర్గతమైంది.
అదే పాఠశాలలో పనిచేస్తున్న తాత్కాలిక మహిళా ఉద్యోగి వద్ద తన ఇద్దరు పిల్లలను అదే పాఠశాలలో అడ్మిషన్ ఇప్పించినందుకు కానుకగా వార్డెన్ ధర్వేశ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇరువురూ ఫోన్ ద్వారా పది వేలు ఇవ్వాలని డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విజయక్రాంతి శనివారం ‘మైనారిటీ గురుకులంలో వసూళ్ల దందా’ శీర్షికన కథనాన్ని ప్రచురించడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వారి ఆదేశా ల మేరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ గోపాల్ నాయక్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఇరువురినీ విధుల్లో నుంచి తొలగిం చినట్లు తెలిపారు.
ప్రిన్సిపల్ సుంకన్నపై కూడా తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అతనిపై యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు తెలిపారు. గురుకుల పాఠశాలలో వర్గాలుగా ఏర్పడి వసూళ్లకు పాల్పడుతున్నట్లు విచారణలో తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.