21-06-2025 01:31:12 AM
పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీలో ఘటనా
ఎల్బీనగర్, జూన్ 20 : హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్ పేట వద్ద శుక్రవారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రామావత్ మాన్ సింగ్ (43) మృతి చెందాడు. విధు లు ముగించుకుని హయత్ నగర్ పరిధిలోని తొర్రూర్ లో ఉన్న తన నివాసానికి బైక్ పై వెళ్తుండగా, పెద్ద అంబర్ పేట వద్ద ముందు వెళ్తున్న టిప్పర్ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది.
ఈ రోడ్డు ప్రమాదంలో మాన్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని హయత్ నగర్ సీఐ నాగరాజుగౌడ్తెలిపారు.