7 August, 2026 | 9:37 PM

మండలంలో మిషన్ భగీరథ లీకులు

22-03-2025 05:55 PM

కల్లూరు,(విజయక్రాంతి): ఎండాకాలం సీజన్ మొదలైంది తాగు మరియు వాడుక నీటి సమస్య తలెత్తే సమయం  గ్రౌండ్ వాటర్ లెవల్ లు తగ్గిపోతాయి. కాబట్టి ఈ సమయంలో మండలంలో అధికారులు  ప్రజల కు నీటి సమస్యపై తలెత్త కుండా చర్యలు  తీసుకోవాలి ప్రజలు కోరుకుంటూన్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ పైపులు  తో ఇంటింటికి నల్లాలు ద్వారా నీటిని అందిస్తున్నారు. గ్రామాల్లో అక్కడక్కడా మిషన్ భగీరథ పైపు లైన్ లు లీకులు ఉన్నాయి అటువంటి లీకులు పంట్టించుకోకుండా నీటి సరఫరా చేస్తున్నారు ఆర్.డి. వో  కార్యాలయం వద్ద, మరియు షుగర్ ఫ్యాక్టరీ వద్ద, పేరువంచ గ్రామం పంచాయితీ లలో లీకులు గుర్తించి మిషన్ భగీరథ  అధికారులు సిబ్బంది ద్వారా లీకులు సరి చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు.