calender_icon.png 1 June, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిషన్ భగీరథ నీటి నాణ్యతను పరిశీలించాలి

29-04-2025 12:00:00 AM

పంప్ హౌస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (విజయ క్రాం తి) : మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేసే త్రాగునీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. ఆదిలాబాద్ రూరల్ మండలం ఫిప్పల్ దరి గ్రామ పం చాయితీ పరిధిలోని దహిగూడ పంప్ హౌస్ ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ మిషన్ భగీరథ నీరు ఆన్ని గ్రామాల కు సరఫరా అవుతున్నాయా, మోటార్లు సరి గా పనిచేస్తున్నాయా అని ఆరా తీశారు.

అనంతరం పంప్ హౌస్‌లో ఏర్పాటు చేసిన రిజిష్టర్‌లో వాటర్ సరఫరాకు సంబంధించిన వివరాల నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా దహి గూడ పంప్ హౌస్ నుండి హత్తి గుట్ట, తిప్ప, లోహారా, ఖండాల, ఖానాపూర్, చిచ్ ధరీ, అల్లికోరి గ్రామాలకు నీటి సరఫరా జరుగుతున్నదని ఎంపిడిఓ, RWS అధికారులు కలెక్టర్ కు విన్నవించారు.

వేసవి దృష్ట్యా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోతే ప్రత్యామ్నాయంగా రెండు బోర్ వెల్స్ మంజూరు చేస్తే మిషన్ భగీరత నీళ్లు రానప్పుడు ప్రత్యామ్నాయంగా నీటి ఇబ్బం ది ఉండదని తెలిపారు. యశ్వంత్ గూడ, రాజుగూడ, లోహరాలో బోర్ వెల్‌ను మం జూరు చేయాలని కోరగా, మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఎంపిడిఓ నాగేశ్వర్ రావు, మిషన్ భగీరథ ఏ.ఈ ఆదిత్య, ఖండాల పంచాయతీ సెక్రటరీ అనిల్, తదితరులు ఉన్నారు.