18 April, 2026 | 12:00 PM

వ్యక్తిగత సహాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

23-05-2025 06:19 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు గుగులోతు నరేష్ తల్లి బిక్కి అనారోగ్యంతో మరణించగా శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కేసముద్రం మండలం పీక్లా తండాకు వచ్చి బిక్కి పార్థివ దేహంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం వ్యక్తిగత సహాయకుడు నరేష్ ను పరామర్శించి ఓదార్చారు.  ఎమ్మెల్యే వెంట కేసముద్రం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.