జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్ దంపతులు
27-07-2026 05:02 PM
చిన్న చింతకుంట: కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. వర్షాలు పుష్కలంగా కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన లో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతూ వారి ఆశీస్సులు ప్రజాపాలన ప్రభుత్వంపై ఉండాలని వారు ఆకాంక్షించారు.






