calender_icon.png 9 June, 2025 | 9:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే గోపీనాథ్ మృతి బీఆర్‌ఎస్‌కు తీరని లోటు

09-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి రామన్న సంతాపం

అదిలాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అకాల మరణం పార్టీకి తీరనిలోటు అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. గోపీనాథ్ మృతి పట్ల అదివారం వేరువేరు ప్రకటన ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన అకాల మరణం తీవ్ర దిగ్భ్రాం తికి గురి చేసిందన్నారు.

గోపీనాథ్ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి, ప్రజలకు విశేష సేవలందించారని, ఆయన అకాల మృతి బీఆర్‌ఎస్ కు తీరని లోటు అని అన్నారు. గోపినాథ్ కు టుంబ సభ్యులు, బంధుమిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

మాగంటి మృతిపై ఎమ్మెల్యే ఏలేటి సంతాపం

నిర్మల్, జూన్ 8 (విజయక్రాంతి): జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అకాల మరణం   పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నట్టు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు ఆదివారం ఆయన ఒక ప్రకటన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారి అకాల మరణం పార్టీకి ప్రజలకు తీరనిలోటు అన్నారు. వారి మరణం పట్ల తీవ్ర సంతా పం వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.