calender_icon.png 9 June, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ ఇకలేరు

08-06-2025 11:11:55 PM

చండూరు/మర్రిగూడ (విజయక్రాంతి): మర్రిగూడ మండల పరిధిలోని శివన్న గూడెం గ్రామానికి చెందిన చిన్నపిల్లల డాక్టర్ కుంభం ఇంద్రారెడ్డి అనారోగ్యంతో ఆదివారం ఉదయం మరణించాడు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి భక్తి భావం ఉండాలని పూజారులకు తన సొంత ఖర్చులతో వేతనం అందించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు తండోపతండాలుగా ఆయనకు సంతాపం వ్యక్తం చేశారు.

ఈయన ఉస్మానియా మెడికల్ కాలేజీ(Osmania Medical College)లో పీడియాట్రిస్ట్ చిన్నపిల్లల డాక్టర్ గా హైదరాబాదులోని సంతోష్ నగర్ లో ఎంతోమంది పేద ప్రజలకు తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందించారు. పిల్లల విద్యభ్యాసానికి పాఠశాలలకు, ఆసుపత్రులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. ఎవరైనా సహాయం అడిగితే తాను కాదనకుండా ఎంతో అంతో సాయం చేసేవాడు. మానవత్వానికి సాటి ఎవరంటే డాక్టర్ కుంభం ఇంద్రారెడ్డి అని ఆ గ్రామ ప్రజలు చెప్పుకుంటారు. ఆయన మరణ వార్త విన్న ప్రతి వ్యక్తి కంటతడి పెట్టినారు.