14 July, 2026 | 7:17 PM

Breaking News

ప్రతి పౌరుడు సర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి   •   విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: గోగుల సరిత   •   ఏకగ్రీవంగా మేడిపల్లి మండల పీఆర్టియుటీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు పీఏ   •   మంథనికి సింగరేణి మెడికల్, మైనింగ్ కళాశాలలు మంజూరు చేయాలి   •   ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్   •   వారం తిరగక ముందే మళ్లీ కోతుల బీభత్సం   •   పెచ్చులూడుతున్న పాఠశాల భవనం.. భయాందోళనలో విద్యార్థులు   •   ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •  

కొనుగోలు కేంద్రాలను ఉన్నాయి కానీ.. కొనేవారు లేరు: హరీశ్ రావు

03-11-2024 03:50 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): అకాల వర్షానికి చాలాచోట్ల వడ్లు తడిసిపోయాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా బద్దిపడగలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే హరీశ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ధన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కానీ.. వడ్లు కొనేవారు లేరు అని ఆయన వివర్శించారు. రైతుల పరిస్థితి గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే దిక్కు అన్నట్లు అయిపోయిందన్నారు.

సోయాబీన్ రైతులకు 2 నెలలుగా డబ్బులు చెల్లించలేదని హరీశ్ రావు మండిపట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు రెండు సీజన్ల రైతుబంధు వేయలేదని దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ హాయంలో ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు రైతుబంధును మాత్రం ఆపలేదని గుర్తు చేశారు. రైతులకు మేలు చేసే రైతుబీమా లేకుండా చేశారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.