calender_icon.png 21 June, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

21-06-2025 01:03:45 AM

గచ్చిబౌలి ఎస్సీ, ఎస్టీ కేసుపై హైకోర్టు విచారణ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 20 (విజయక్రాంతి): 2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.  ఈ కేసు గోపన్‌పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 127లో భూమి వివాదానికి సంబంధించినది.

ఎస్సీ మ్యూచువల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ఎన్ పెద్దిరాజు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఆయన సోదరుడు కొండల్‌రెడ్డి, ఇతరులు సొసైటీకి చెందిన భూమిని ఆక్రమించి, జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఫిర్యాదుదా రుడిని కులం పేరుతో దూషించారని ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో రేవంత్‌రెడ్డి మూడో నిందితుడిగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. 2020లోనే ఆయన హైకోర్టును ఆశ్రయించారని, ఈ ఆరోపణలు రాజకీ య దురుద్దేశంతో కూడుకున్నవని, ఎలాంటి ఆధారాలు లేవని వాదించినట్లు పేర్కొన్నారు.

విచారణ సమ యంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపున ఎనిమిది మంది సాక్షులను విచారించారని,  వారిలో ఎవరూ కూడా రేవంత్‌రెడ్డి ఘటనా స్థలంలో ఉన్నట్లు నిర్ధారించలేదని తెలుస్తోంది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.