23-09-2025 01:21:00 AM
బిచ్కుంద, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ టోర్నీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా యువకులతో ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. క్రీడల వల్ల స్నేహసంబంధాలు పెరు గుతాయని, ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా మళ్లీ గెలి చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.