04-09-2025 07:24:53 PM
నిర్మల్ (విజయక్రాంతి): నర్సాపూర్ మండలం కుస్లి గ్రామం నుండి ప్రేమ్ నగర్ తండా వరకు రూ.1 కోటి 20 లక్షల నిధులతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మారుమూల తండాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను, రోడ్లను పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించి రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మండల పరిషత్ మాజీ అధ్యక్షులు వి సత్యనారాయణ గౌడ్, నాయకులు ముత్యం రెడ్డి, మండల అధ్యక్షులు నరేందర్, నాయకులు రాజేందర్, అర్జున్, ప్రవీణ్ పటేల్, మహిపాల్,భూమన్న, గంగాధర్, సుధాకర్, దత్తురాం, తో పాటు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.