4 May, 2026 | 3:36 PM

Breaking News

సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేసిన మేయర్   •   అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలంటూ తాసిల్దార్ కు వినతి   •   తల్లి ఏడవకండి.. మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది   •   ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం   •   కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •  

తరాల చరిత్రను మార్చిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

04-05-2026 02:10 PM

నాగిరెడ్డిపేట్,మే4 (విజయక్రాంతి): తరతరాలుగా ఎన్నో ప్రభుత్వాలు మారిన,ఎంతో మంది ఎమ్మెల్యేలు మారిన మండలంలోని తాండూరు గ్రామంలో నాలుగు వార్డు, ఐదవ వార్డులలో గల రోడ్లపై మురికి నీరు పారేది.వర్షం కాలంలో నడవడానికి వీలు లేకుండా ఉండేదనీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నాలుగు,ఐదు వార్డు ప్రజల కష్టాలను బాధలను తీర్చాలని ఉద్దేశంతో నూతన సీసీ రోడ్లు నిర్మాణం కొరకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షల నిధులు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మంజూరు చేశారని గ్రామ సర్పంచ్ యాదా గౌడ్ తెలిపారు.

4,5 వార్డుల ప్రజలకు కష్టాలకు గుర్తించి తలరాత చరిత్ర మార్చి నూతన సీసీ రోడ్డు మంజూరు చేసినందుకు గ్రామ సర్పంచ్ యాదవ్ గౌడ్తో పాటు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  యాదగౌడ్,ఉప సర్పంచ్ అభిషేక్,గ్రామస్తులు ప్రభాకర్, మధు,వేముల సంగయ్య, లింగం,రమేష్ తదితరులు ఉన్నారు.