23-09-2025 12:23:21 AM
చొప్పదండి, సెప్టెంబర్22(విజయక్రాంతి);గంగాధర మండలం మంగపేట గ్రామం దళిత కుటుంబానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగాల హరిప్రసాద్ అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందగ.
హైదరాబాద్ లో ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకుని హరిప్రసాద్ మృతి కి ప్రగాఢ సంతాపం తెలిపి, అంత్యక్రియల నిమిత్తం తక్షణ సహాయంగా రూ. పది వేల రూపాయలు (10000/-) మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని భాధిత కుటుంబ సభ్యులకుఅందజేశారు.