13-11-2025 10:15:13 PM
మెదక్ టౌన్: తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయంలో ప్రధాన పూజారి శంకర్ శర్మ కూతురి వివాహం మెదక్ పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.