02-06-2025 12:30:36 AM
భద్రాచలం, జూన్ 1 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వా మి వారి ఆలయ పునః ప్రారంభోత్స వం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సం దర్భంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ జూన్ 6వ తారీకు జరగబోయే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాని హాజరై వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రు లు కా వాలని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని కోరి న ఆలయ కమిటీ సభ్యులు కోరారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పట్టణ ప్రముఖులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.