బడి పిల్లల కోసం బోర్ వేపించిన ఎమ్మెల్యే పాయం
గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని సాయనపల్లి గ్రామపంచాయతీలో గల ఘణాపురం గ్రామంలో పాఠశాల నందు బోర్ మరమ్మతులకు గురి కావడంతో రెండు సంవత్సరాల నుండి విద్యార్థులకు మంచి నీటి కొరత ఏర్పడి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఈ విషయాన్నీ సాయనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి కృష్ణవేణి నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు తెలపడంతో వెంటనే స్పందించి శుక్రవారం బోర్ వెల్ సహాయంతో బోర్ వేపించడం జరిగింది.
దీంతో ఆ పాఠశాలకు సమబంధించిన విద్యార్థులు ఆనందంతో పాయం వెంకటేశ్వర్లకు ధన్యవాదములు తెలపడం జరిగింది. వారే కాకుండా ఆ గ్రామ పెద్దలు మహిళలు కూడా పిల్లల కోసం అడిగిన వెంటనే బోర్ వేపించిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అరెం బసవయ్య, ఇర్ప కన్నయ్య, జగ్గారావు, కల్తి రాంబాబు, చంద్రయ్య, బిక్షపతి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






