28 July, 2026 | 1:05 PM

Breaking News

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •  

బడి పిల్లల కోసం బోర్ వేపించిన ఎమ్మెల్యే పాయం

12-06-2026 05:53 PM

గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని సాయనపల్లి గ్రామపంచాయతీలో గల ఘణాపురం గ్రామంలో పాఠశాల నందు బోర్ మరమ్మతులకు గురి కావడంతో రెండు సంవత్సరాల నుండి విద్యార్థులకు మంచి నీటి కొరత ఏర్పడి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఈ విషయాన్నీ సాయనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ కల్తి కృష్ణవేణి నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు తెలపడంతో వెంటనే స్పందించి శుక్రవారం బోర్ వెల్ సహాయంతో బోర్ వేపించడం జరిగింది.

దీంతో ఆ పాఠశాలకు సమబంధించిన విద్యార్థులు ఆనందంతో పాయం వెంకటేశ్వర్లకు ధన్యవాదములు తెలపడం జరిగింది. వారే కాకుండా ఆ గ్రామ పెద్దలు మహిళలు కూడా పిల్లల కోసం అడిగిన వెంటనే బోర్ వేపించిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తి కృష్ణవేణి, అరెం బసవయ్య, ఇర్ప కన్నయ్య, జగ్గారావు, కల్తి రాంబాబు, చంద్రయ్య, బిక్షపతి గ్రామ ప్రజలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.