28-07-2025 02:43:12 PM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ,(విజయక్రాంతి): కేటీఆర్, కవితల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మరని స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం హనుమకొండ కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటూపడిందన్నారు. కొంతమంది దొంగలు మాస్టర్ ప్లాన్ ను తప్పుదారు పట్టించి సబ్జాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ మొదటిగ 120 మంది అర్హులకు ఆగస్టు 15 లోపు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మూడు విడుదలగా విచారణ జరుగుతుందని నిజమైన అర్హులను ఎంపిక చేసిన ఐదు లక్షల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తుందన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా తమ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కల్వకుంట్ల కవిత, కేటీఆర్ లు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని, రైతులకు రైతుబంధు, వృద్ధాప్య పింఛను, కల్యాణ లక్ష్మి, రైతు రుణమాఫీ తదితర పథకాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రజా చర్చకు సిద్ధంగా ఉండాలని అన్నారు.