07-06-2025 03:13:46 PM
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
తాడూర్: ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదల కళ్ళల్లో ఆనందం వెల్లువిరుస్తుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. శనివారం తాడూరు మండల కేంద్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకానికి అర్హత పొందిన 550 లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఇల్లు అనేది ప్రతి పౌరుని జీవిత లక్ష్యం ఇందిరమ్మ పథకం ద్వారా ఆ కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేయడం మా ప్రాధాన్యత అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హునికి మంజూరు చేసే దిశగా ముందుకెళ్తున్నామన్నారు.
ప్రముఖ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ వృద్ధనాయకులు, లబ్ధిదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పత్రాలు అందుకున్న లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఇది మా జీవితాల్లో ఒక మైలురాయి. ప్రభుత్వానికి ఎమ్మెల్యే కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు బక్రీద్ పర్వదినం సందర్భంగా శ్రీపురం రోడ్లోని ఈద్గా వద్ద ప్రతేక ప్రార్థనలు జరుపుతున్న ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.