4 May, 2026 | 1:20 PM

37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి

04-05-2026 12:03 PM

పాల్వంచ, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సోమవారం 37డివిజన్ ఆపరేటర్ మల్లెల స్వప్న కుమారి ఎమ్మెల్యే సాంబశివరావును కోరారు. గత 30 సంవత్సరాల నుండి డ్రైనేజీ వ్యవస్థ ను ఎవ్వరు పట్టించుకోలేదు. డివిజన్ లో ఇండ్ల మధ్యలో పెద్ద మురుగు కాలువ ప్రవహిస్తుందని దానిని పునర్ నిర్మాణం నకు కాలువ మరమత్తులకు నిధులు కేటాయించమని కొత్తగూడెం శాసన సభ్యులుని కలిసి వినతి పత్రం అందజేశారు. డివిజన్ లోని రోడ్లు, డ్రైన్లకు నిధులు కేటాయించి సహకరించవలసిందిగా కోరారు.  రామాలయం నకు నూతన కమిటీని ఏర్పాటు చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని, షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలతో దేవాలయం అభివృద్ధి చేసుకోవచ్చని రామాలయం అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది. ఆమె వెంట బిఆర్ఎస్ నాయకులు మల్లెల రవిచంద్ర పాల్గొన్నారు.