calender_icon.png 28 May, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

26-05-2025 01:41:32 AM

నిజాంసాగర్, మే 25( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం లోని మాగి గ్రామంలో బోనాల ఉత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  ముఖ్యఅతిథిగాపాల్గొన్నారు.అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

అమ్మవారి చల్లని చూపులు జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. అంతకుముందు బిచ్కుందలో బండాయప్ప మఠాధిపతి సోమలింగ శివచార్యులు ను ఎమ్మెల్యే కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్, నాయకులు గుర్రపు శ్రీనివాస్, ప్రజా పండరి,గంగి రమేష్, ఆకాష్, పండరి, మెంగారం శ్రీనివాస్ పాల్గొన్నారు.