calender_icon.png 13 August, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వేముల

10-08-2025 05:06:18 PM

నకిరేకల్,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో ఇంద్ర కీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారిని ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి వేదపండితులు ఆశీర్వచనం చేసి.తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులతో నకిరేకల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పున్న కైలాసనేత, నకిరేకంటి నరేందర్. తదితరులు పాల్గొన్నారు.