calender_icon.png 26 May, 2025 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

26-05-2025 12:25:33 AM

భద్రాచలం, మే 25 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పర్యటనకు వచ్చిన రాష్ట్ర శాసన మండల సభ్యులు మరియు కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ దంపతులు ఆదివారం ఉదయం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అధికారులు సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.