16-06-2025 12:29:33 AM
- డీఎస్సీ స్పోర్ట్స్ కోటా తుది జాబితాను విడుదల చేయని అధికారులు
- నివేదికను వెంటనే బహిర్గతం చేసి ఫలితాలను విడుదల చేయాలంటున్న అభ్యర్థులు
- ఈనెల 23, 24 తేదీల్లో డీఎస్సీ కార్యాలయం ముందు నిరసన తెలుపనున్న అభ్యర్థులు
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఆరు నెలలుగా ఎదురుచూస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకో వటం లేదు. అధికారుల చుట్టూ తిరిగినా రేపు, మాపంటున్నారే తప్పా, తుది జాబితా ను ఎంతకీ బయటకు పెట్టడంలేదు. అధికారుల తప్పిదానికి తాము నష్టపోతున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 వేలకుపైగా టీచర్ పోస్టులకు సంబంధించిన డీఎస్సీ 2024 ఫలితాలను గతేడాది అక్టోబరులో ప్రకటించారు. ఇందులో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 95 పోస్టులున్నాయి.
వీటికి 8 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను ప్రకటించిన తర్వాత స్పోర్ట్స్కోటాలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బాధ్యతను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ప్రభుత్వం అప్పగించింది. 393 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను అక్టోబర్లో పరిశీలించి ఆ కోటా లోని 95 పోస్టులకుగానూ దాదాపు 33 మంది అభ్యర్థులకు అప్పట్లో ఉద్యోగాలిచ్చారు. అభ్యర్థులు లేరనే కారణంతో మిగిలి న పోస్టులను ఓపెన్ కోటాలో పెట్టారు.
దీంతో నియామకాల్లో అక్రమాలు జరిగాయని, అర్హులైన వారికి ఉద్యోగాలివ్వకుండా అనర్హులకు ఇచ్చారంటూ అభ్యర్థులు ఆరోపించటంతో నవంబర్ 20, 21, 22 తేదీల్లో అధికారులు రెండోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ను చేపట్టారు. తర్వాత జనవరి 3, 4న మళ్లీ మూడోసారి ఉన్నతాధికారులు సర్టిఫికె ట్ వెరిఫికేషన్ చేపట్టారు. ఇలా మూడుసార్లు వెరిఫికేషన్ చేసి నా అధికారులు మాత్రం ఇంత వరకూ తుది నివేదికను బయటపెట్టే దు. నవంబర్ 30 వరకే జాబితాను విడుదల చేస్తామని అప్పట్లో పాఠశాల విద్యాశాఖ అధికారులు తమతో చెప్పారని, కానీ ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలను విడుదల చేయలేదని ఆర్ రమేశ్ అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు.
పోరుబాటకు సంసిద్ధం..
స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల ఎంపికకు సం బంధించి క్రమపద్ధతిలో పోస్టింగులు ఇవ్వలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అంత ర్జాతీయ స్థాయి, జాతీయ, రాష్ట్రస్థాయిలో క్రీడల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగాలివ్వకుండా అడ్డగోలుగా ఉద్యోగాలిచ్చారని అభ్యర్థులు వాపోతున్నా రు. కొన్ని జిల్లాల్లో కొంతమందికి జాతీయ స్థాయిలో ఆడిన వారికి ఇవ్వకుండా రాష్ట్రస్థా యి క్రీడాకారులకు, కొన్ని జిల్లాల్లో అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడాకారులను పక్కనబెట్టి జిల్లా స్థాయి క్రీడల్లో పాల్గొన్న వారికి పోస్టింగులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు.
ఇదే విషయంలో గతం లో హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. ఈనెల 23 లేదా 24న డీఎ స్సీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా తుది జాబితాను బయటపెట్టకుండా తాత్సారం చేస్తే, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోటీగా నిలిచి తమ నిరసనను తెలుపుతామని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా సంసిద్ధమవుతున్నారు.