28 June, 2026 | 1:52 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

‘బడ్జెట్‌లో విద్యకు అధిక నిధులు కేటాయించాలి’

22-07-2024 02:57 AM

హైదరాబాద్, జూలై 21 ( విజయక్రాంతి): కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో విద్యకు అధిక శాతం నిధులు కేటాయించాలని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (ఏఐఎస్‌ఎఫ్) నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్య పరిరక్షణకు, బలోపేతానికి మోదీ ప్రభుత్వం సరైన నిధులు ఇవ్వలేదన్నారు. తెలంగాణ విభజన హామీల ప్రకారం తెలంగాణలో ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, ఐఐఐటీ, ఐఐఎం లాంటి అనేక విద్యాసంస్థలు తెలంగాణలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని తెలిపారు.

తెలంగాణ రాష్ర్టంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా నిధులు కేటాయించిందని ఆరోపించిన వారు  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే మొదటి బడ్జెట్లో విద్యకు 30శాతం నిధులు కేటాయించాలని కోరారు. రాష్ర్టంలో అంగన్వాడీ కేంద్రాల్లో మూడో తరగతి వరకు విద్యను అందించేలా రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, ఈ నిర్ణయంతో బీజేపీ తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం 2020ని రాష్ర్టంలో అమలు చేసినట్లవుతుందన్నారు.