calender_icon.png 2 February, 2026 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీపీ యూనిట్ ముందు పసిబిడ్డలతో బాలింతల పడిగాపులు

02-02-2026 11:29:11 AM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలోని పీపీ యూనిట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సినేషన్ కోసం వచ్చే బాలింతలు, చిన్నారులతో వచ్చిన తల్లులకు పడిగాపులు తప్పడం లేదు. గంటల తరబడి కాళ్లకు తిమ్మిర్లు వచ్చే దాక వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వ్యాక్సినేషన్ సేవలు నిలిచిపోతున్నాయి.

విధుల్లో ఉండాల్సిన వైద్యాధికారులు హైదరాబాద్ వంటి పట్టణాల్లో మఖాం వేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా సంబంధిత మెడికల్ ఆఫీసర్ ఒక్కరోజు కూడా స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపీ యూనిట్ పనితీరుపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు