17-02-2026 07:01:28 PM
హనుమకొండ,(విజయక్రాంతి): జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో హన్మకొండ మోషన్ జూనియర్ కాలేజీ (కోటా, రాజస్థాన్) విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని మోషన్ జూనియర్ కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.
సిహెచ్. దేవాన్ష్ 99.25 పర్సెంటైల్ (260310107667),
బిట్ల హాసిని 96 పర్సంటైల్ (260310072064),
పలికా శ్రీవర్ధిత 92.28 పర్సంటైల్ (260310306294),
అక్కెనపెల్లి నిహారిక 91.62 పర్సంటైల్ (260310161531)
ఇమ్మడి శరణ్య 90.84 పర్సంటైల్ (260310048868),
చిరుమళ్ల భార్గవి 90.47 పర్సంటైల్ (260310577200) సాధించినట్లు తెలిపారు.ఈ సందర్బంగా వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కోటా రాజస్థాన్ మోషన్ హెడ్ సెంటర్ నుండి వచ్చిన కోటా సీనియర్ ఫాకల్టీ, కోటా మెటీరియల్, కోటా ప్రోగ్రాం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఈ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఈ విజయానికి అంకితభావంతో కృషి చేసిన అధ్యాపకులకు, ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, ప్రిన్సిపాల్ ముత్యాల సురేష్, హన్మకొండ బ్రాంచ్ హెడ్ మారపెల్లి సమ్మయ్య, కోటా అధ్యాపకులు అనూప్ కుమార్, సురేందర్ సాహు, మిథున్, ప్రదీప్ పాఠక్, ఇంటర్ ఫాకల్టీ శ్రీనివాస్ రెడ్డి, సరోత్తం రెడ్డి, లడేగే రమేష్ కాలేజీ సిబ్బంది శనిగరపు సుమన్, తాళ్లపెల్లి రమేష్ గౌడ్, మండల రాజు, లక్ష్మణ్, అరుణ, ఉమ, స్పందన, మధు, కడారి అనిల్ తదితరులు పాల్గొన్నారు.