12-06-2025 11:39:42 PM
ఖమ్మం (విజయక్రాంతి): గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమాన ప్రమాద(Plane Crash Incident) ఘటన చోటుచేసుకోగా, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి(MP Ramasahayam Raghuram Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని.ల, బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని సూచించారు. కేంద్ర పౌర విమానయానం శాఖ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు.