13-06-2025 12:00:00 AM
ప్రారంభించిన డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): తార్నాక డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలలో బడిబాట-2025 కార్యక్రమాన్ని గురువారం నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతశోభన్రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్రెడ్డి తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలు, యూని ఫాం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న డిజిటల్ తరగతి గదులు, సైన్స్, గణితం, ఇంగ్లీష్ ల్యాబ్స్, వృత్తిపరమైన కోర్సులు (బైండింగ్, ఎలక్ట్రికల్, టైలరింగ్), ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత బస్ పాస్, స్కాలర్షిప్స్, ఆరు నుంచి పదో తరగతులకు కంప్యూటర్ తరగతుల వంటి అనేక ప్రోత్సాహక కార్యక్రమాలను వివరించారు.
విద్యా ర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని గొప్ప విజయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూ టీ ఈవో బాలునాయక్, టీచర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రు లు తదితరులు పాల్గొన్నారు.