13-06-2025 12:00:00 AM
బోయి భీమన్న అవార్డు గ్రహీత మురళీధర్రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): అబిడ్స్ చీర గల్లీలోని చాదర్ ఘాట్--2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గు రువారం బడిబాట కార్యక్రమం నిర్వహించా రు. ముఖ్య అతిథిగా బోయి భీమన్న అవా ర్డు గ్రహీత కే మురళీధర్రెడ్డి హాజరై మాట్లాడారు. తాను ఆ పాఠశాల పూర్వ విద్యార్థిని అని చెప్పారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోందన్నా రు.
పాఠశాలలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరి యం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్ఎంలు మంగారెడ్డి, ఎస్ సోమయ్య, నాంపల్లి మండల డిప్యూటీ ఐఓఎస్ విశ్వనాథం, సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి వెంకట రమణ, ఉపాధ్యాయులు మంజులారెడ్డి సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.