14 April, 2026 | 7:14 PM

Breaking News

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?: విద్యార్థి సంఘ నేతలు   •   బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ఆర్ కు ఘన సన్మానం   •   అంబేడ్కర్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకం   •   బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహణ   •   వైశాఖీ పండుగకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యత: డాక్టర్ కోట నీలిమ   •   ప్రభుత్వం ద్వంద్వ వైఖరి మానుకోవాలి   •   దశల వారిగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా   •   యాదగిరిగుట్టలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు   •   నల్లచేరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   కరీంనగర్ లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •  

సుల్తానాబాద్‌లో అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

14-04-2026 03:18 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారత రత్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణానికి చేరుకున్న ఎంపీ వంశీ కృష్ణ కు అంబేద్కర్ ఉత్సవ కమిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకునే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుంది అన్నారు.

కేంద్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా డీలిమిటేషన్ చేయాలని, అందరికీ సమాన న్యాయం కల్పించే విధంగా డీలిమిటేషన్ ఉండాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పార్లమెంట్ లో మేము పోరాటం చేస్తాం అని, పార్లమెంటులో మన రాష్ట్రానికి న్యాయం జరిగేలా డిలిమిటేషన్ పై తెలంగాణ గళం విప్పుతాం అని చెప్పారు,అందరికీ సమాన హక్కులు రాజ్యాంగం మనకు కల్పించింది.బడుగు బలహీన వర్గాల కోసం మేమెప్పుడూ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అని గడ్డం వంశీకృష్ణ తెలిపారు.