అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ నేతల ఘన నివాళులు
14-04-2026 03:21 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): బీజేపీ మండల అధ్యక్షుడు భట్టు రమేష్ ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన దేశానికి అందించిన రాజ్యాంగ సేవలను స్మరించుకున్నారు. భట్టు రమేష్ మాట్లాడుతూ... డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, గొప్ప రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా దేశ సేవలో నిలిచారని పేర్కొన్నారు.




