21-06-2025 04:59:14 PM
చిలుకూరు: యోగ డే(International Yoga Day) సందర్భంగా శనివారం చిలుకూరు మండలం ఆచార్యుల గూడెం గ్రామంలో చిలుకూరు మండల ఎంపీడీవో కే గిరిబాబు గ్రామ ప్రజలతో కలిసి యోగ డేలో పాల్గొనడం జరిగింది. వారి వెంట, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పారెల్లి మహేష్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో గిరిబాబు, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
యోగాసనాలు చేయడం వల్ల శరీరాన్ని బలపరుస్తాయి, రక్తప్రసన్న మెరుగుపడి హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. జ్ఞాన సాధన క్రమంగా చేస్తే ఏకాగ్రత పెరుగుతుందని, చదువుల్లో ఉద్యోగ జీవితంలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని దృష్టి ఏకాగ్రత మెరుగు పడుతుంది అని సంపూర్ణ శ్రద్ధతో జీవించడం అభివృద్ధి చెందుతుందని డిప్రెషన్ ఆందోళన అలసట వండి సమస్యలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు ముత్తయ్య, అన్నదేవర మురళి చారి, గ్రామపంచాయతీ కార్యదర్శి గుండపనేని రామారావు , ఫీల్డ్ అసిస్టెంట్ పారెల్లి సోమశంకర్, వి బి కే రత్నకుమారి, జానకి, సిబ్బంది కృష్ణయ్య, రాములు, శీను చారి, సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.