10-08-2025 11:07:20 PM
లక్షెట్టిపేట,(విజయక్రాంతి): పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ముదిరాజ్ సంఘం పట్టణ అధ్యక్షులుగా చీకటి తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ గా శిరవేణి శంకర్, భూత గడ్డ చంద్రయ్య జనరల్ సెక్రెటరీ గా కంకణాల రాజు, గడ్డం కొమరయ్య, క్యాషియర్ గా తొండబోయిన దేవేంద్రుడు విజయ్,ఆర్గనైజ్ సెక్రెటరీ గా దండ బోయిన అర్జున్, కంకణాల రాజేశ్వర్, సలహాదారుగా చీకటి కొమురయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.