06-06-2025 12:18:16 AM
మెట్రో టీవీ, ట్రై నెట్ లైవ్ టీవీ ఆధ్వర్యంలో..
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): కింగ్ కోటి, తెలంగాణ సరస్వతి కళా పరిషత్తులో మెట్రో టీవీ, ట్రై నెట్ లైవ్ టీవీ వారి ఆధ్వర్యంలో గురువారం మల్టీ టాలెంట్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కే మురళీధర్రెడ్డికి ‘సేవరత్న‘ అవార్డు ఇచ్చి శాలువాతో సత్కరించారు.
సేవా కార్యక్రమాలు చేసిన వారిని ప్రోత్సహించడం సంతోషంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అండగా ఉంటారని మురళీధర్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో టీవీ డైరెక్టర్ జయ ప్రసాద్, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, సినీ నటులు పాల్గొన్నారు.