calender_icon.png 17 June, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి పట్టుబడ్డ ములుగు డీఈవో పాణి

16-06-2025 08:50:38 PM

వరంగల్ ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయుడు..

ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ములుగు డీఈవో..

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు గత సంవత్సరం ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదానికి గురై అక్టోబర్ నెల వరకు సిక్ లో ఉన్నడాని తెలిపారు. ఆనంతరం తన జాయినింగ్ కోసం లక్ష్మీపురం ప్రధానోపాద్యాయున్ని సంప్రదించగా మూడు నెలలు గడిచి నందున రీజైనింగ్ కోసం డీఈఓ కార్యాలయం నుండి ఆర్డర్ కాఫీ తీసుకురావాలని సూచించారు. కాగా సదరు ఉపాద్యాయుడు డీఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయగా తనకు రూ.20 వేల రూపాయలు లంచంగా ఇస్తేనే రీజాయినింగ్ ఆర్డర్ ఇస్తానని డీఈఓ డిమాండ్ చేశారని, ఆర్డర్ ప్రిపేర్ చేసేందుకు డీఈఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ దిలీప్ రూ. 5వేలు డిమాండ్ చేశారని తెలిపారు. 2024 అక్టోబర్ నుండి పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా కూడా తనకు ఆర్డర్ ఇవ్వలేదు.

మళ్లీ 2025 జూన్ 12 వతేదీన కార్యాలయానికి రాగా డీఈఓ కార్యాలయ అధికారులు డబ్బులు ఇస్తేనే ఆర్డర్ ఇస్తామని కరాఖండీగా చెప్పగా తాను అంత డబ్బులు ఇవ్వలేనని బ్రతిమిలాడగా రూ. 5వేలు తగ్గించి ఇవ్వాలన్నారు. వారికి డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని ఉపాధ్యాయుడు వరంగల్ ఎసిబి కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సోమవారం ఇద్దరు అధికారులు రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఎసిబి అధికారులు దాడి నిర్వహించారు ఎసిబి డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం డీఈఓ కార్యాయలంలో ఏసీబీ ప్రణాళిక ప్రకారం ఉపాధ్యాయుడు డబ్బులు ఇస్తుండగా డీఈఓ ఫాణిని, సీనియర్ అసిస్టెంట్ దిలీప్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారి దగ్గర నుండి నగదును రికవరీ చేశామని తెలిపారు.

సదరు ఉపాధ్యాయుని ఫైల్ చెక్ మూమెంట్ చేయగా ఫిబ్రవరిలోనే అతని జాయినింగ్ ఆర్డర్ ప్రిపేర్ చేసి,డబ్బుల కోసమే అతని జాయినింగ్ ఆర్డర్ ఆపారని స్పష్టమవుతోందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న డీఈఓ ఫాణిని, దిలీప్ లను వరంగల్ ఎసిబి కోర్టులో హాజరు పరుచ నున్నట్లు తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగినట్లయితే ఎసిబి టోల్ ఫ్రీ నెం. 1064కు కాల్ చేయాలని ఎసిబి డీఎస్పీ సాంబయ్య సూచించారు. ఈ దాడిలో ఎసిబిచెయాలని ఎసిబి డిఎస్పి సాంబయ్య సూచించారు. ఈ దాడిలో ఎసిబి అధికారులు ఎస్. రాజు, ఎల్. రాజు లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

మొన్న జెడ్పీకార్యాలయంలో నేడు డీఈఓ కార్యాలయంలో ఎసీబీ దాడులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం పోరాటాలతో ఏర్పడిన ములుగు జిల్లాలో పాలన సౌలబ్యం ఉంటుందనుకున్న ప్రజలు లంచాధికారులతో విసిగిపోయి ఏసిబి అధికారులను ఆశ్రయిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో రెండు ఎసీబీ దాడులే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. మొన్న జెడ్పీ కార్యాలయంలో కింది స్థాయి అధికారి వేతన చెల్లింపుకోసం సూపరింటెండెంట్, సెక్షన్ ఆఫీసర్ లు 60వేలు డిమాండ్ చేయగా ఎసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

నెల రోజులు గడువక ముందే డీఈఓ కార్యాలయంలో ఎసీబీ దాడులు జరుగడం జిల్లాలో చర్చనీ యాంశంగా మారింది. సొంత శాఖలకు చెందిన ఉన్నతాధికారులే ఉద్యోగులను లంచాల కోసం వేదిస్తున్నారనే విషయం జిల్లాలో బహిర్గతమవుతోంది. అవినీతి అధికారుల భరతం పడుతున్న ఎసీబీ చర్యలను ప్రజలు అభినంది స్తున్నారు. అన్నిశాఖల్లో ఉన్న అవినీతి అధికారులపై కూడా ఏసీబీ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాగా మిగతా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఎసీబీ వరుసదాడులతో బెంబేలెత్తుతున్నారు.