25-06-2025 01:04:58 AM
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం, జూన్ 24 (విజయక్రాంతి): మున్నేరు నది కిరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చే యాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల పురోగతి, భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ స్థలాన్ని మంగళ వారం క్షేత్ర స్థాయి లో పరిశీలించారు. కలెక్టర్ కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, పోలేపల్లి వద్ద క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
రిటైనింగ్ వాల్, డ్రెయిన్, రోడ్డు నిర్మాణాలు, పరిహార భూమి అభివృద్ధి ప నుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇ్ర రిగేషన్ ఎస్ఇ ఎం. వెంకటేశ్వర్లు, ఇఇ అన న్య, ఖమ్మం ఆర్డీవో జి. నర్సింహారావు, పాలే రు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖ మ్మం అర్బన్, రూరల్ మండల తహశీల్దార్లు సైదులు, రాంప్రసాద్, ఇర్రిగేషన్ డిఇ రమేష్ రెడ్డి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.