25-06-2025 01:06:56 AM
అదనపు కలెక్టర్ వీరారెడ్డి
యాదాద్రి భువనగిరి జూన్ 24 ( విజయ క్రాంతి ): ఆపదలో ఉండే వారి ప్రాణాలను రక్షించేందుకు రక్తదానం చేయడంలో యువత ముందుండాలని యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ,రోటరీ క్లబ్ భువనగిరి సెంట్రల్ సంయుక్త నిర్వహణలో స్థానిక వివేరా హోటల్స్ అధినేత, రెడ్ క్రాస్ డివిజన్ కమిటీ చైర్మన్ సద్ది వెంకటరెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హోటల్ న్యూ వివేరా కాంప్లెక్స్ లో రక్తదానం, కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.
వివేరా హోటల్స్ యాజమాన్యం, సిబ్బంది 74 మంది రక్తదానం చేయగా 64 మంది సిబ్బందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. వివేరా హోటల్స్ అధినేత సద్ది వెంకటరెడ్డి తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తన సిబ్బందితో, కుటుంబ సభ్యులతో రక్తదానం చేయించడం, సిబ్బందికి, రోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేసి, అద్దాలు ఉచితంగా అందించడం అభినందనీయమని వివరించారు.
ఆర్డీవో కృష్ణారెడ్డి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ,రోటరీ క్లబ్లు చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కంటి వైద్య శిబిరాన్ని స్థానిక తహసిల్దార్ అంజిరెడ్డి ప్రారంభించారు.
రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ జి. లక్ష్మీనరసింహారెడ్డి, వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ ,డివిజన్ చైర్మన్ సద్ది వెంకటరెడ్డి,జిల్లా కార్యదర్శి ఎస్పీ ఉపేందర్ రావ్, జిల్లా డైరెక్టర్లు శేక్.హమీద్ పాశ, ఎస్.ఎన్. చారి,భువనగిరి రోటరీ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు హనీఫ్,సెక్రటరీ,డాక్టర్ సుమంత్, జ్ఞాన ప్రకాష్ రెడ్డి శెట్టి బాలయ్య యాదవ్ కరిపే నర్సింగరావు,తంగేళ్లపల్లి రవికుమార్,
పక్కీరు కొండల్ రెడ్డి, చల్ల గురుకుల రఘుబాబు, చింత బాలయ్య, హైదరాబాద్ విద్య నగర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ ఉష,,ప్రభాకర్,ప్రమీల రెడ్ క్రాస్ డివిజన్ సభ్యులు ఐలేని రాంరెడ్డి, విజయ్ కుమార్,పట్టణ సభ్యులు చంద్ర శేఖర్, క్రిస్టోఫర్,ఎస్పీ,స్పందన,లావణ్య,వెంకాయమ్మ సిస్టర్,తదితరులు పాల్గొన్నారు.