25-06-2025 01:04:53 AM
అనంతగిరి జూన్ 24: ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త డాక్టర్ మొలుగూరి గోపయ్య కోరారు. మంగళవారం అనంతగిరి మండల కేంద్రం తో పాటు చనుపల్లి, త్రిపురవరం, పాలారం, కిష్టాపురం, ఖానాపురం, అమీనాబాద్ గ్రామాలలో స్వచ్చందంగా నిర్వహించిన ప్రకృతి వ్యవ సాయంపై రైతు చైతన్య యాత్రలో మాట్లా డారు.
ఈ సందర్బంగా సహజసిద్ద పద్ధతుల తో వ్యవసాయం చేయవచన్నారు తెలిపారు. గత 60 ఏళ్లుగా చేస్తున్న రసాయన వ్యవ సాయంతో భూసారం దెబ్బతిన్నదన్నారు. భూసారం పెరగాలంటే పచ్చిరొట్ట పంటలైన జీలుగ, జనుము, పిల్లి పెసర సాగు చేయాలని, పశువుల ఎరువు వేయాలని, జీవామృతం వాడాలన్నారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా సాగు చేయవచన్నారు.
నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం అని, పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం అన్నారు. ప్రతి రైతు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుండి ఒక అర ఎకరం లేదా ఒక పెద్ద మడిలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. ప్రస్తుతం వేప గింజలను సేకరించుకోవాలని, పంటపై ఎలాంటి పురుగులు ఆశించిన వేప గింజల కాషాయం తో నివారించుకోవచన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు.