07-12-2025 06:31:36 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంను ఆదివారం సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయం ట్రస్టు వ్యవస్థాపకులు, చైర్మన్, గురుస్వామి సాయిరి మహేందర్ సమీప బంధువు అయినటువంటి సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ అయ్యప్ప స్వామి ఆలయం 8 నెలలోనే తక్కువ సమయంలో ఇంత అద్భుతంగా నిర్మించిన సాయిరి పద్మ మహేందర్ దంపతుల సేవలు మరువలేనివి అని అభినందించారు. అనంతరం అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయిరీ మహేందర్ సంగీతం శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్త్యాల రవీందర్, ఆలయ భక్త బృందం పాల్గొన్నారు.