1 July, 2026 | 9:58 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బీజేపీలో చేరిక

07-12-2025 06:17 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి వరలక్ష్మి, 8 మంది వార్డు మెంబర్ సభ్యులతో కలసి ఆదివారం భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ గతం గుడెన్ఘాట్, తుంపల్లి గ్రామాలలో చాలా అభివృధి పనులు చేపట్టామని అన్నారు.

గ్రామాలు అభివృధి చెందాలంటే భాజపాతోనే సాధ్యం అవుతుందని అన్నారు. గ్రామాల అభివృధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనేక నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ప్రధాన మంత్రి చేపడుతున్న పనులకు ఆకర్షితులై గ్రామస్థాయి కార్యకర్తలు భాజపాలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేకల దత్తు, టెకం రాము, కౌసల్య, అంబ రావు, తదితరులు పాల్గొన్నారు.