1 July, 2026 | 7:42 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

ఘనంగా ఆర్ద్రా మహోత్సవం

07-12-2025 06:34 PM

కొండపాక (విజయక్రాంతి): బ్రాహ్మీ ముహూర్త ఆర్ద్రాభిషేకంలో కలెక్టర్ హైమవతి పాల్గొని కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఆదివారం ఆర్ద్రా మహోత్సవం నిర్వహించారు. క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్గశిర మాసంలో వచ్చిన ఆర్ద్రా నక్షత్రం కావడం బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం 4 గంటలకే గణపతి పూజ నిర్వహించి సంతాన మల్లికార్జున స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు.

అభిషేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమవతి పాల్గొని స్వయంగా సంతాన మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం చేశారు. అనంతరం విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వస్తి వాచనం అనంతరం నవగ్రహ, దిక్పాలక, రుద్ర కలశ స్థాపన చేసి సంతాన పాశుపత అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి విశేష పంచామృత ఫలరస అభిషేకం నిర్వహించారు. అనంతరం సంతాన పాశుపత హవనం, పూర్ణాహుతి జరిగాయి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.