07-06-2025 12:41:44 AM
సూర్యాపేట, జూన్ 6 (విజయక్రాంతి) : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం రోడ్డు వెళ్లే సమీపంలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో జరిగే ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈద్గాకు వచ్చే ముస్లిం సోదరులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చూడాలని సూచించారు. సూర్యాపేట పట్టణం నుంచి పొట్టి శ్రీరాములు సెంటర్, పోస్ట్ ఆఫీస్, కోర్టు చౌరస్తా, ఎస్వీ కాలేజ్ గుండా ఈద్గాకు వెళ్లి ప్రార్థన అనంతరం అంజనీపురి కాలువ నుండి తిరిగి వెళ్లాలన్నారు. ఈద్గాకు వెళ్లే మార్గాలను,ఈద్గాను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని పోలీసుకు పలు సూచనలు చేశారు.