24-04-2025 01:53:02 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): జమ్మూకశ్మీర్లో ఉగ్రదాడిని నిరసిస్తూ మహబూబాబాద్ వక్ఫ్ బోర్డు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కన్వీనర్ మొహమ్మద్ ఇక్బాల్, మొహమ్మద్ ఫరీద్, మొహమ్మద్ ఫజల్, ముఫ్టీ ఆలం గీర్ సాబ్, సయ్యద్ ఆదిల్, బుల్లెట్ ఇమాం, మోసిన్, మౌలానా సాజిద్ ఇమాముద్దీన్, సయీద్, గయాజ్, అష్రఫ్, ఫాజిల్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.