calender_icon.png 9 June, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

24గంటలు అందుబాటులో ఉండాలి

04-06-2025 12:32:01 AM

  1. ఎమర్జెన్సీ టీమ్స్ సిద్ధంగా ఉండాలి
  2. వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలి
  3. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేయాలి 
  4. వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష  

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించా రు. ఇప్పటికే గుర్తించిన 141వాటర్ లాగింగ్ పాయింట్స్‌లో వాటర్ హార్వేస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సీఎం సమీక్షించారు.

వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని, వర్షాలు, వరదలకు సంబంధించి క మాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాల న్నారు.

అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తిచే యాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాం తాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఔటర్ రింగ్‌రోడ్డులోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని, కోర్ అర్బ న్ రీజియన్ పరిధిలోని చెరువులు, నాలా లు, రోడ్డు విస్తరణ, అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక పాలసీని తయారుచేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. సమావేశంలో సీఎస్ రా మకృష్ణారావు, సీఎంవో అధికారులు శేషాద్రి, మాణిక్‌రాజ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పాల్గొన్నారు.