calender_icon.png 5 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగిరెడ్డిపేట ఎంపీడీవో, ఎంపీవోలపై సస్పెన్షన్ వేటు

05-12-2025 12:00:00 AM

నామినేషన్ల వివరాలు అందజేయడంలో నిర్లక్ష్యం

కలెక్టర్ ఆగ్రహం

నాగిరెడ్డిపేట్,డిసెంబర్ 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం ఎంపీడీవో లలితకుమారి,ఎంపీవో ప్రభాకర్‌చారిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల వివరాలను అందించడంలో ఆ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వన్ గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలోకి వెళితే నాగిరెడ్డిపేట మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30న, డిసెంబర్ ఒకటి రెండవ తేదీల్లో మూడు రోజులపాటు సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

అయితే ఆ ఇద్దరు అధికారులు జిల్లా అధికారులకు సకాలంలో నామినేషన్ల వివరాలు అం దించడంలో నిర్లక్ష్యంతో పాటు అందుబాటులో ఉండకపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎల్లారెడ్డి డీఎప్పీఓ సురేందర్ ఫిర్యాదు మేరకు ఆర్డీఓ పార్థసారధి రెడ్డి విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదిక అందజేశారు.దానితో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి, ఎంపీవో శ్రీనివాసులను సస్పెండ్ చేశారు.