calender_icon.png 15 June, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగోల్ డివిజన్ సమస్యలను పరిష్కరించాలి

14-06-2025 11:59:08 PM

ఎమ్మెల్యేను కోరిన సాయినగర్ కాలనీ నాయకులు..

ఎల్బీనగర్: నాగోల్ డివిజన్ పరిధిలోని శ్రీ సాయినగర్ లో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి(MLA Devireddy Sudheer Reddy) కాలనీవాసులకు హామీ ఇచ్చారు. శనివారం శ్రీ సాయినగర్ ఓనర్స్ అసోసియేషన్ భవనంలో నాగోల్ డివిజన్ లోని వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు పలు సమస్యలను వివరించారు. కొన్ని కాలనీల్లో డ్రైనేజ్ ఓవర్ ఫ్లో కావడంతో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరారు.

రాత్రిపూట కొన్ని చిల్లర మూకలు గంజాయి సేవిస్తూ రోడ్డు మీద పోయేవారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. లక్కీ రెస్టారెంట్ వద్ద అక్రమ పార్కింగ్ పెట్టి కాలనీలోకి రాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. కాలనీ అసోసియేషన్ భవనంలో నీటి కొరత ఉన్నదని, ఒక బోరు మోటర్ ఇప్పించాలని, రాత్రిపూట పోలీసు బందోబస్తు పెంచాలని కోరారు. జనాభా పెరిగిన నేపథ్యంలో గతంలో వేసిన మంచినీటి పైప్ లైన్ స్థానంలో నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాలని అడిగారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి కాలనీల్లో గస్తీ పెంచుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆనంతుల రాజారెడ్డి, తూర్పాటి చిరంజీవి, శ్యామ్ సుందర్ రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ యుగంధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకట రెడ్డి, రవీందర్ రెడ్డి, సెక్రెటరీ రవీందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఆకుల శ్రీనివాస్ కే.గోపాల్ రావు, మాజీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, శ్రీనివాసరావు, సుధీర్ రెడ్డి, బీమిడి వెంకట్ రెడ్డి, సూర్య ప్రకాశ్, అరవింద్ రెడ్డి, నాగేంద్ర ప్రసాద్, అశోక్ కుమార్, శ్రీనివాస్ రావు, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.